ముద్దాడలో వృద్ధుడి సజీవ దహనం

ABN , First Publish Date - 2021-02-28T05:39:02+05:30 IST

మండలంలోని ముద్దాడ గ్రామానికి చెందిన మడ్డి రామప్పడు (81) అనే వృద్ధుడు శుక్రవారం అర్ధ రాత్రి సజీవ దహనమయ్యాడు.

ముద్దాడలో వృద్ధుడి సజీవ దహనం

 ఎచ్చెర్ల, ఫిబ్రవరి 27: మండలంలోని ముద్దాడ గ్రామానికి చెందిన మడ్డి రామప్పడు (81) అనే వృద్ధుడు శుక్రవారం అర్ధ రాత్రి సజీవ దహనమయ్యాడు. గ్రామస్థుల వివరాల మేరకు.. రామప్పడు గ్రామంలోని ఓ పూరిపాకలో ఒంటిరిగా నివాసం ఉంటున్నాడు. శుక్రవారం రాత్రి వెలుతురు కోసం దీపం వెలి గించాడు. గ్రామంలో ఉంటున్న కుమార్తె వచ్చి తండ్రికి భోజనం పెట్టి వెళ్లిపోయింది. అయితే, అర్ధరాత్రి సమయంలో రామప్పడు కప్పుకున్న దుప్పటికి నిప్పు అంటుకోవడంతో మంటలు చెలరేగాయి. దీంతో ఆయన మంటల్లో చిక్కుకొని  మృతి చెందాడు. శరీరం మొత్తం కాలిపోయి, మృతదేహం గుర్తుపట్టడానికి వీల్లేకుండా తయారైంది. ఈ విషయాన్ని శనివారం తెల్లవారుజామున చుట్టుపక్కలవారు గుర్తించారు.  విషయం తెలుసుకున్న ఎస్‌ఐ జి.రాజేష్‌ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. 

Updated Date - 2021-02-28T05:39:02+05:30 IST