సీపీఐ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-05-25T06:29:00+05:30 IST

మునుగోడులో జూన్‌ 3, 4వ తేదీల్లో నిర్వహించనున్న సీపీఐ 22వ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్య దర్శి నెల్లికంటి సత్యం పిలుపునిచ్చారు.

సీపీఐ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలి
నల్లగొండలో పోస్టర్లు ఆవిష్కరిస్తున్న సీపీఐ నాయకులు

నల్లగొండ రూరల్‌/ దేవరకొండ/ మునుగోడు, మే 24 : మునుగోడులో జూన్‌ 3, 4వ తేదీల్లో నిర్వహించనున్న సీపీఐ 22వ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా కార్య దర్శి నెల్లికంటి సత్యం పిలుపునిచ్చారు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యా లయంలో జిల్లా మహాసభల పోస్టర్ల మంగళవారం ఆవిష్కరించారు. కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలు ఎన్నికల హమీలను విస్మరించి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం డిజిల్‌, పెట్రోల్‌, గ్యాస్‌ ధరలను విపరీతంగా పెంచిందన్నారు. సీఎం కేసీఆర్‌ ప్లోరైడ్‌ సమస్యను పరిష్కరించి డిండి ఎత్తిపోతల, ఎస్‌ఎ ల్‌బీసీ ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యవైఖరి అవలంబిస్తున్నారని విమర్శిం చారు. కార్యక్రమంలో సీపీఐ సీనియర్‌ నాయకులు మల్లెపల్లి ఆదిరెడ్డి, శ్రవణ్‌కుమార్‌, స్వామి, గాదెపాక రమేష్‌ నేతి యాదగిరి, విశ్వనాఽథుల లెనిన్‌, విగ్నేష్‌, దోటి పాండయ్య ఉన్నారు. దేవరకొం డలోని సీపీఐ కార్యాలయంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్లా నర్సింహారెడ్డి జిల్లా మహాసభల పోస్టర్లు ఆవిష్కరించారు. కార్యక్రమం లో గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమావత్‌ అంజయ్య నాయక్‌, నాయకులు పల్లా దేవేందర్‌రెడ్డి, కేశవరెడ్డి, నూనె రామస్వామి, వల మాల ఆంజనేయులు, దేప సుదర్శన్‌రెడ్డి, వెంకట్రాములు, మైనొద్దిన్‌, రాంరెడ్డి పాల్గొన్నారు. మునుగోడులో జరిగిన సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం మాట్లాడారు. మహాసభలపై జిల్లా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. సమావేశంలో నాయకులు బొల్గూరి నర్సింహ, గురిజ రామచంద్రం, చలపతి, శ్రీను పాల్గొన్నారు.

Updated Date - 2022-05-25T06:29:00+05:30 IST