అత్త మందలించిందని కోడలు ఆత్మహత్య
ABN , First Publish Date - 2022-04-04T04:51:28+05:30 IST
పండించిన పంటను పుట్టింటికి చేరవేస్తున్నావంటూ అత్త గొడవ పడటంతో మనస్థాపం చెందిన కోడలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భద్రాద్రి కొతగూడెం జిల్లా గుండాల మండలంలో ఆదివారం జరిగింది.
11రోజులు మృత్యువుతో పోరాడి చివరికి మృతి
మృతురాలు ఐదు నెలల గర్బిణి
గుండాల, ఏప్రిల్ 3: పండించిన పంటను పుట్టింటికి చేరవేస్తున్నావంటూ అత్త గొడవ పడటంతో మనస్థాపం చెందిన కోడలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన భద్రాద్రి కొతగూడెం జిల్లా గుండాల మండలంలో ఆదివారం జరిగింది. మండలంలోని నర్సాపురం తండాకు చెందిన బోడ సరితకు(25) అదే గ్రామానికి చెందిన భద్రుతో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. కాగా ఇటీవల చేతికొచ్చిన మిర్చి పంటను పుట్టింటికి చేరవేస్తున్నావంటూ అత్త సువాలి కోడలిని మందలించింది. ఇదే విషయమై రెండు వారాలక్రితం ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో మనస్థాపం చెందిన సరిత పురుగుల మందుతాగింది. దాంతో కుటుంబ సభ్యులు ఆమెను వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అం దిస్తుండగా 11రోజులు పా టు మృత్యువుతో పోరాడి పరిస్థితి విషమిం చడంతో ఆదివారం ఉదయం మృతి చెందిం ది. మృతు రాలు ఐదు నెలల గర్బిణి కాగా ఆమెకు ఇప్పటికే రెండేళ్ల వయస్సున్న కుమారుడు ఉన్నాడు. ఈ ఘటనపై గుండాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.