సొంత ఊళ్లో నిరాశ్రయులు
ABN , First Publish Date - 2020-03-28T10:07:04+05:30 IST
ఈ దంపతులది కర్నూలు. హైదరాబాదులో పని చేసుకుంటూ జీవించేవారు. కరోనా విపత్తుతో అక్కడ పని
కరోనా వల్ల కర్నూలుకు వచ్చిన దంపతులు
మూడ్రోజులుగా కలెక్టరేట్లో..
కర్నూలు, మార్చి 27(ఆంధ్రజ్యోతి): ఈ దంపతులది కర్నూలు. హైదరాబాదులో పని చేసుకుంటూ జీవించేవారు. కరోనా విపత్తుతో అక్కడ పని లేకుండాపోయింది. దీంతో మూడు రోజుల కింద కర్నూలుకు వచ్చారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఇందులో పాపకు క్యాన్సర్. ఇక్కడ వీరికి నిలువ నీడ దొరకలేదు. ఈ మూడు రోజులుగా కలెక్టరేట్ చెట్ట కింద ఉంటున్నారు. కర్నూలుకు చెందిన ఎస్కె. వలీ, నాగమణి మతాంతర వివాహం చేసుకున్నారని ఇద్దరి కుటుంబాలు దూరం పెట్టాయి. దీంతో హైదరబాదులో కష్టం చేసుకొని జీవించేవారు. ఇప్పుడిలా సొంత ఊళ్లో నిరాశ్రయులుగా బిక్షమెత్తుకొని జీవిస్తున్నామని ఈ దంపతులు తెలిపారు. అధికారులు దయతలచి తమకు ఆశ్రయం కల్పించాలని వీరు కోరుతున్నారు.