పల్లెలను పరిశుభ్రంగా ఉంచాలి

ABN , First Publish Date - 2022-05-18T05:48:54+05:30 IST

పల్లెలను పరిశుభ్రంగా ఉంచాలి

పల్లెలను పరిశుభ్రంగా ఉంచాలి
పెద్దనందిగామలో గ్రామస్తులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి

 కొడంగల్‌, మే 17 : పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండల పరిధిలోని పెద్దనందిగామ గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించారు. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని సక్రమంగా అమలు చేయాలని, శిథిలావస్థకు చేరిన ఇళ్లు, వాటి మధ్యలో పెంట కుప్పలను, పాడుబడిన ఇళ్లను వెంటనే తొలగించాలని మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శిని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదేశించారు. గ్రామంలో సీసీ రోడ్లు, సైడ్‌ డ్రైనేజీ వ్యవస్థ, అంగన్‌వాడీ పాఠశాలలు, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదులు, వంట గదుల గురించి అధికారులతో మాట్లాడారు. అదేవిధంగా గ్రామంలో త్రీఫేజ్‌ కరెంటు సౌకర్యం ఏర్పాటు చేసి, పంట పొలాల్లో వేలాడుతున్న విద్యుత్‌ తీగలను సరి చేయాలని విద్యుత్‌ శాఖ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ శాఖల అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-18T05:48:54+05:30 IST