యాదాద్రిలో శ్రీరామ పట్టాభిషేకం

ABN , First Publish Date - 2020-04-04T09:55:59+05:30 IST

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శుక్రవారం చరమూర్తులు కొలువైన ఉపాలయంలో

యాదాద్రిలో శ్రీరామ పట్టాభిషేకం

యాదాద్రి టౌన్‌, ఏప్రిల్‌ 3: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శుక్రవారం చరమూర్తులు కొలువైన ఉపాలయంలో సీతారామచంద్రస్వామి పట్టాభిషేకం నిర్వహించారు. రాత్రివేళ కల్యాణ మూర్తుల శృంగార డోలోత్సవాలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. చరమూర్తులు కొలువైన ఉపాలయంలో సీతారామచంద్రస్వామిని ఆరాధించి రామపట్టాభిషేకపర్వాలను అర్చకులు శైవాగమ పద్ధతిలో నిర్వహించారు.


ఈ వేడుకలను దేవస్థాన ప్రధాన పురోహితులు గౌరీభట్ల సత్యనారాయణ శర్మ, శివాలయ ప్రధానార్చకులు గౌరీభట్ల నరసింహరామశర్మ, అర్చకబృంద, వేద పండితులు నిర్వహించగా దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు. ఇదిలా ఉండగా యాదాద్రీశుడికి శుక్రవారం సువర్ణ పుష్పార్చనలు, ఆండాళ్‌ అమ్మవారి ఊంజల్‌సేవ నిర్వహించారు. యాదాద్రి మునిసిపల్‌ కార్యాలయ పారిశుధ్య విభాగ కార్మికులు, ప్రైవేట్‌ వాహనాల డ్రైవర్లకు శుక్రవారం యాదాద్రి దేవస్థాన అర్చకులు కొడకండ్ల మాధవాచార్యులు ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. 

Updated Date - 2020-04-04T09:55:59+05:30 IST