వరంగల్లో కరోనా పాము

ABN , First Publish Date - 2020-04-01T17:43:07+05:30 IST

నగరంలో నాగుపాము హల్‌చల్ చేసింది.

వరంగల్లో కరోనా పాము

వరంగల్: నగరంలో నాగుపాము హల్‌చల్ చేసింది. సుమారు రెండు గంటలపాటు కాలనీ రోడ్డుపై తచ్చాడుతూ అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. వరంగల్ నగరంలోని బృందావన్ కాలనీలోని కృష్ణ జ్యోతిష్యాలయం ముందు ఈ ఘటన చోటు చేసుకుంది. గతంలో ఈ జ్యోతిష్యాలయంలో కుబుసం విడిచి గంటలపాటు ఉండడం అంతా ఆ దేవుని మాయ అని అంటున్నారు. ఓకలహవేళి నాగేంద్రస్వామి ఆలయ ప్రదాన అర్చకుడు కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు నాగేంద్రుడు పాము రూపంలో వచ్చి అందరికీ అభయాన్ని ఇచ్చిందని ఈ సందర్భంగా తెలిపారు. పామును చూసేందుకు కాలనీ వాసులు ఎగబడ్డారు. ఇలా ఎందుకు వచ్చిందో.. ఇది దేనికి సంకేతమో.. ఒకవేళ కాలసర్ఫదోషం ముదిరి ఇలా అయిందా అనే సందేహంతో రకరకాలుగా జనం కలవరపడ్డారు. మొత్తానికి జ్యోతిష్యాలయం ముందు జరిగిన ఈ ఘటన  రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. దీనికి జనం కరోనా పాము అని పేరు పెట్టారు.

Updated Date - 2020-04-01T17:43:07+05:30 IST