Basara IIIT: బాసర ట్రిపుల్ ఐటీలో మళ్ళీ మొదలైన వివాదం
ABN , First Publish Date - 2022-07-23T18:38:43+05:30 IST
బాసర ట్రిపుల్ ఐటీలో మరోసారి వివాదం మొదలైంది. ఈ3 విద్యార్థులకు సెలవులు ప్రకటించడంపై రగడ చోటు చేసుకుంది.
నిర్మల్ జిల్లా: బాసర ట్రిపుల్ ఐటీ(Basara IIIT)లో మరోసారి వివాదం మొదలైంది. ఈ3 విద్యార్థుల(Students)కు సెలవులు ప్రకటించడంపై రగడ చోటు చేసుకుంది. సమస్యల పరిష్కారానికి విద్యార్థులు విధించిన డెడ్ లైన్ రేపటితో ముగియనుంది. మరో 48 గంటలే ఉందంటూ నిన్న విద్యార్థులు ట్వీట్ చేశారు. ట్వీట్ చేసిన గంటకే అధికారులు సెలవులు ప్రకటించారు. దీంతో సెలవుల ప్రకటనపై ఈ3 విద్యార్థుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించమంటే.. సెలవులు ప్రకటించారంటూ విద్యార్థులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.