కార్మికుల సమస్యలపై నిరంతర పోరాటం
ABN , First Publish Date - 2022-06-26T06:36:13+05:30 IST
కార్మికుల సమస్యల పరిష్కారానికి వ్యవసాయ కార్మిక సంఘం ప్రభుత్వం పై పోరాటం చేస్తుందని వ్యవసాయ కార్మిక సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు కలకొండ కాంతయ్య అన్నారు.
దేవరకొండ, జూన 25: కార్మికుల సమస్యల పరిష్కారానికి వ్యవసాయ కార్మిక సంఘం ప్రభుత్వం పై పోరాటం చేస్తుందని వ్యవసాయ కార్మిక సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు కలకొండ కాంతయ్య అన్నారు. శనివారం దేవరకొండ సీపీ ఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది వ్యవసాయ కార్మికుల హక్కుల సాధన కోసం సాగు భూములు, ఇళ్ల స్థలాలు, డబుల్బెడ్ రూం ఇళ్లు, పించనల అమలుకోసం ఉద్యమాలు నిర్వహిస్తుందని ఆయన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయ ని తెలిపారు. ఈ నెల 29, 30 తేదీల్లో హైదరాబాద్లో జరిగే వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర వర్క్షాపును విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సమావేశంలో వ్యకాస జిల్లా ప్రధాన కార్యదర్శి బొల్లూరి నర్సింహ, మండల కార్యదర్శి కిన్నెర బారీముల్, నాయకులు హుస్సేన, అన్నెపాక నిరంజన, బుచ్చయ్య, పల్లెకృష్ణయ్య, ఇద్దయ్య, రాజిరెడ్డి పాల్గొన్నారు.