కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలను తిప్పికొట్టాలి

ABN , First Publish Date - 2021-07-31T06:04:27+05:30 IST

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కుట్రలను ప్రజలు గ్రహించాలని టీడీపీ విశాఖ పార్లమెంట్‌ కమిటీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలను తిప్పికొట్టాలి
ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తున్న టీడీపీ విశాఖ పార్లమెంట్‌ కమిటీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు

టీడీపీ విశాఖ పార్లమెంట్‌ కమిటీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు

గాజువాక, జూలై 30: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కుట్రలను ప్రజలు గ్రహించాలని టీడీపీ విశాఖ పార్లమెంట్‌ కమిటీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించవద్దని, నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన పాదయాత్రను శుక్రవారం ప్రారంభించారు. తొలుత గాజువాకలోని ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రగతిపఽథంలో పయనిస్తున్న ప్లాంట్‌ను ప్రైవేట్‌వారికి అప్పగించేందుకు చేస్తున్న కుట్రను అడ్డుకుంటామన్నారు. ప్లాంట్‌ను కాపాడుకునేందుకు ఎంతటి త్యాగాలకైనా సిద్ధమన్నారు. ఈ పాదయాత్ర పెదగంట్యాడ నిర్వాసిత కాలనీల్లో కొనసాగింది. ఈ కార్యక్రమంలో గాజువాక సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్‌, కార్పొరేటర్‌లు గంధం శ్రీనివాస్‌, పులి లక్ష్మీబాయి, బొండా జగన్‌, రౌతు శ్రీనివాస్‌, మొల్లి ముత్యాలనాయుడు, టీఎన్‌టీయూసీ  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోగంటి లెనిన్‌బాబు, నాయకులు పులి వెంకటరమణారెడ్డి, మొల్లి పెంటిరాజు, నమ్మి సింహాద్రి, శ్రీనివాసవర్మ, కోన సోమినాయుడు, భాస్కరరావు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-31T06:04:27+05:30 IST