బాధితుల ఫిర్యాదుపై తక్షణం స్పందించాలి

ABN , First Publish Date - 2022-08-18T05:28:46+05:30 IST

వివిధ సమస్యలపై బాధితులు చేసే ఫిర్యాదులపై పోలీసు అధికారులు తక్షణం స్పందించి న్యాయం చేయాలని పెద్దపల్లి డీసీపీ రూపేష్‌ అన్నా రు.

బాధితుల ఫిర్యాదుపై తక్షణం స్పందించాలి
డీసీపీ రూపేష్‌కు స్వాగతం పలుకుతున్న సీఐ, ఎస్సై

- పెద్దపల్లి డీసీపీ రూపేష్‌

మంథని, ఆగస్టు 17: వివిధ సమస్యలపై బాధితులు చేసే ఫిర్యాదులపై పోలీసు అధికారులు తక్షణం స్పందించి న్యాయం చేయాలని పెద్దపల్లి డీసీపీ రూపేష్‌ అన్నా రు. మంథని పోలీసు స్టేషన్‌ను డీసీపీ రూపేష్‌ బుధవారం సాయంత్రం తనిఖీ చేశారు. స్టేషన్‌ ఆవరణను పరిశీలించారు. స్టేషన్‌ నిర్వాహణపై, కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అధికారులు, సిబ్బందికి వివిధ అంశాలపై పలు సూచనలు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేరాల నియంత్రణ కోసం సీసీ కెమెరాల ఏర్పాటుపై ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ బాధ్యత పోలీసులపై ఉందన్నారు. ఆయన వెంట మంథని సీఐ సతీష్‌, ఎస్‌ఐ వెంక టేశ్వర్లు ఉన్నారు. 

Updated Date - 2022-08-18T05:28:46+05:30 IST