కొండగట్టులో భక్తుల కోలాహలం
ABN , First Publish Date - 2021-06-23T06:02:17+05:30 IST
కొండగట్టు అంజన్న సన్నిధానం భక్తులతో కోలాహలంగా మారింది. లాక్డౌన్ ఎత్తివేయడంతో గత ఆదివా రం నుంచి ఆలయంను తెరచి భక్తులకు దర్శన సౌకర్యం కల్పించ గా మంగళవారం భక్తుల తాకిడి పెరిగింది.
మల్యాల, జూన్ 22: కొండగట్టు అంజన్న సన్నిధానం భక్తులతో కోలాహలంగా మారింది. లాక్డౌన్ ఎత్తివేయడంతో గత ఆదివా రం నుంచి ఆలయంను తెరచి భక్తులకు దర్శన సౌకర్యం కల్పించ గా మంగళవారం భక్తుల తాకిడి పెరిగింది. వేలల్లో భక్తులు అం జన్నను దర్శించుకున్నారు. స్వామి వారి మొక్కులు చెల్లించుకు న్నారు. భక్తులతో ఆలయంలోని క్యూలైన్లు నిండాయి. వాహన పూజలు కూడా పుంజుకుంటు న్నాయి. అయితే కొవిడ్ నిభంధనల ను భక్తులు పాటించక గుంపులుగా ఉండగా, క్యూలైన్లోనూ సా మాజిక దూరం కనిపించలేదు. భక్తులు, అంజన్నతో పాటు బేతా లుడు, రామలయంలోనూ పూజలు చేశారు. భక్తులకు ఇబ్బందు లు కలుగకుండా ఆలయ అధికారులు పర్యవేక్షించారు