పరిసరాల పరిశుభ్రత పాటించాలి
ABN , First Publish Date - 2021-06-19T06:29:23+05:30 IST
ప్రస్తుతం వర్షాకాలం ఆరంభమైనందున అంటువ్యాదులు ప్రబలకుండా ఉండాలంటే పరిసరాల పరిశుభ్రతకు ప్రతీఒక్కరు కృషి చేయాలని ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్ అన్నారు.
ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్
ఖానాపూర్, జూన్ 18 : ప్రస్తుతం వర్షాకాలం ఆరంభమైనందున అంటువ్యాదులు ప్రబలకుండా ఉండాలంటే పరిసరాల పరిశుభ్రతకు ప్రతీఒక్కరు కృషి చేయాలని ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్ అన్నారు. శుక్రవారం డ్రై డే సందర్భంగా పట్టణంలోనే పలు కాలనీల్లో ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. పట్టణంలోని పలువార్డుల్లో ఆయావార్డు కౌన్సిలర్ల ఆద్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్తోట గంగాధర్ సహా పలువురు కౌన్సిలర్లు, హెల్త్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.