వైసీపీ, టీడీపీ వర్గాల ఘర్షణ

ABN , First Publish Date - 2020-05-31T09:22:13+05:30 IST

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం నరసాపురం పంచాయతీ పందిగుంట గ్రామంలో శనివారం వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య కొట్లాట చోటుచేసుకుంది. గ్రామంలో పాఠశాల భవనం వద్ద తాగునీటి బోరు విషయమై ఇరువర్గాల

వైసీపీ, టీడీపీ వర్గాల ఘర్షణ

సంతబొమ్మాళి, మే 30: శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం నరసాపురం పంచాయతీ పందిగుంట గ్రామంలో శనివారం వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య కొట్లాట చోటుచేసుకుంది. గ్రామంలో పాఠశాల భవనం వద్ద తాగునీటి బోరు విషయమై ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో వైసీపీకి చెందిన డొక్కరి మల్లేషు, టీడీపీకి చెందిన పిల్లల పోలయ్య వర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. ఈ ఘటనలో 30 మందికి పైగా స్వల్ప గాయాలయ్యాయి. సంఘటనా స్థలాన్ని ట్రైనీ డీఎస్పీ శ్రీలత,  టెక్కలి సీఐ నీలయ్య సందర్శించారు. గ్రామంలో పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేశారు.

Updated Date - 2020-05-31T09:22:13+05:30 IST