సీఐ తీరు అమానుషం
ABN , First Publish Date - 2020-08-07T10:26:23+05:30 IST
దళితుడిపై పలాస సర్కిల్ ఇన్స్పెక్టర్ వ్యహరించిన తీరు అమానుషం, దుర్మార్గమని జిల్లా మేధావుల ఫోరం అధ్యక్షుడు, విశ్రాంత జిల్లా ..
గుజరాతీపేట: దళితుడిపై పలాస సర్కిల్ ఇన్స్పెక్టర్ వ్యహరించిన తీరు అమానుషం, దుర్మార్గమని జిల్లా మేధావుల ఫోరం అధ్యక్షుడు, విశ్రాంత జిల్లా జడ్జి పప్పల జగన్నాథరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలపై మరింత బాధ్యతగా, వారికి సహాయపడే విధంగా పోలీసులు వ్యవహరించాలే తప్ప ఇలా దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ ఘటనపై ఎస్పీ స్పందించిన తీరు అభినందనీయమన్నారు. తప్పు చేసిన అధికారిపై చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత కుటుంబానికి క్షమాపణలు చెప్పి పోలీసు శాఖపై గౌరవం పెరిగేలా చేశారని తెలిపారు.