NV Ramana: పద్మశ్రీ గుత్తా మునిరత్నం విగ్రహాన్ని ఆవిష్కరించిన సీజేఐ ఎన్వీ రమణ
ABN , First Publish Date - 2022-08-19T17:26:26+05:30 IST
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శుక్రవారం ఉదయం తిరుపతిలోని రాస్ బిల్డింగ్ వద్దకు చేరుకున్నారు.
తిరుపతి: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ (NV Ramani) శుక్రవారం ఉదయం తిరుపతిలోని రాస్ బిల్డింగ్ వద్దకు చేరుకున్నారు. రాస్ బిల్డింగ్ వద్ద ఎన్వీ రమణ (CJI)కు మేళ తాళాలతో ఘన స్వాగతం లభించింది. అనంతరం రాస్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు, పద్మశ్రీ స్వర్గీయ గుత్తా మునిరత్నం (Gutta muniratnam) విగ్రహాన్ని సీజేఐ ఆవిష్కరించారు. అనంతరం జస్టిస్ ఎన్వీ రమణ (Justice NV Ramana) మాట్లాడుతూ... ఎన్.జీ.రంగ, వివోభాబావే, రాజగోపాలనాయుడు వంటి స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలకు అనుగుణంగా పని చేసిన వ్యక్తి మునిరత్నం అని తెలిపారు. మహిళలు, రైతులకు రాస్ సంస్థ ద్వారా సేవలు అందాయన్నారు. సంస్థ మరింత అభివృద్ది చెందాలని సీజేఐ ఎన్వీ రమణ ఆకాంక్షించారు.