ఘనంగా వేంకటేశుని చక్రతీర్థ స్నానం

ABN , First Publish Date - 2021-10-19T04:36:35+05:30 IST

భక్తుల జయజయ ధ్వనాల నడుమ సోమవారం వేంకటేశ్వరసామి చక్రతీర్థ స్నానం నిర్వహించారు. తోటపల్లి వేంకటేశ్వర, కోదండరామస్వామి ఆలయాల్లో పవిత్రోత్సవాలు ముగిశాయి. అందులో భాగంగా సోమవారం ఉదయం అర్చకుల వేదమంత్రాలు, మంగళవాయిద్యాల

ఘనంగా వేంకటేశుని చక్రతీర్థ స్నానం
చక్రతీర్థ స్నానం చేయిస్తున్న దృశ్యం





తోటపల్లిలో ముగిసిన పవిత్రోత్సవాలు

గరుగుబిల్లి, అక్టోబరు 18: భక్తుల జయజయ ధ్వనాల నడుమ సోమవారం వేంకటేశ్వరసామి చక్రతీర్థ స్నానం నిర్వహించారు. తోటపల్లి వేంకటేశ్వర, కోదండరామస్వామి ఆలయాల్లో పవిత్రోత్సవాలు ముగిశాయి. అందులో భాగంగా సోమవారం ఉదయం అర్చకుల వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక పల్లకిలో నాగావళి నది వద్దకు తీసుకెళ్లారు. అర్చకులు వీవీ అప్పలాచార్యులు, పి.గోపాలకృష్ణమాచార్యులు, కె.శ్రీనివాసాచార్యులు స్వామివారికి చక్రతీర్థ స్నానం చేయించారు. ఆలయ ఈవో బి.లక్ష్మీ నగేష్‌ ఏర్పాట్లను పర్యవేక్షించారు. పూజల అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు.



Updated Date - 2021-10-19T04:36:35+05:30 IST