జడ్పీ చైర్మన పదవి కురుబలకు కేటాయించాలి
ABN , First Publish Date - 2021-04-13T06:17:31+05:30 IST
జిల్లాలో అఽత్యధికం గా ఉన్న కురుబలకు రాజకీయ ప్రాధాన్యం కల్పి స్తూ... జడ్పీ చైర్మన, వైస్ చైర్మన పదవులను కేటాయించాలని కురబ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిరుతల విఠల్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కురుబ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిరుతల విఠల్ గౌడ్
అనంతపురం ప్రెస్క్లబ్, ఏప్రిల్12: జిల్లాలో అఽత్యధికం గా ఉన్న కురుబలకు రాజకీయ ప్రాధాన్యం కల్పి స్తూ... జడ్పీ చైర్మన, వైస్ చైర్మన పదవులను కేటాయించాలని కురబ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చిరుతల విఠల్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమ వారం ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో 6.10 లక్షల ఓటర్లు ఉన్న కురుబలకు రాజకీయ ప్రాధాన్యత కరువైం దన్నారు. వెంటనే వారికి జిల్లా జడ్పీ చైర్మన, వైస్ చై ర్మన స్థానాలను కేటాయించాలన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ బిల్లే ఈశ్వరయ్య, జాతీయ ఉపాధ్యక్షుడు బోరం పల్లి ఆంజనేయులు, వశికేరి రమేష్, జిల్లా మాజీ యువజన సంఘం అధ్యక్షుడు కాటమయ్య, కోశాధికారి కొదమల వెంక టేష్, రాష్ట్ర కార్యదర్శి బ్యాళ్ల నాగేంద్ర, బుల్లే లింగప్రసాద్, కురుబ యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోరే విశ్వనాథ్, బండి కాశీ, జిల్లా యువత ప్రధాన కార్యదర్శి దండు కేశవ, వశికేరి శివ, విశ్వనాథ్ పాల్గొన్నారు.