కేంద్రం పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలి

ABN , First Publish Date - 2021-05-06T06:02:30+05:30 IST

కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని రైతు ఉద్యమ నాయకుడు ఈదల వెంకటాచలం నాయుడు డిమాండ్‌ చేశారు.

కేంద్రం పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలి
గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేస్తున్న రైతు నాయకుడు ఈదల వెంకటాచలం నాయుడు

 గాంధీ విగ్రహం వద్ద రైతు నాయకుడి ధర్నా

చిత్తూరు, మే 5: కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని రైతు ఉద్యమ నాయకుడు ఈదల వెంకటాచలం నాయుడు డిమాండ్‌ చేశారు.  బుధవారం ఆయన  పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలని కోరుతూ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్పంచ్‌ నుంచి మంత్రులు, ముఖ్య మంత్రుల వరకు వారి వారి జీతాలు పెరగాలంటే నిమిషాల్లో పెరిగిపోతాయని, అదే రైతులు కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించమంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కిస్తున్నాయని విమర్శించారు. నిరసన కార్యక్రమానికి సీపీఐ నాయకులు ఎస్‌. నాగరాజన్‌, డీహెచ్‌పీఎస్‌ నేతలు దాసరి చంద్ర, రఘు మద్దతు పలికారు. కష్టాల్లోఉన్న రైతులను ఆదుకోవడానికి కేంద్రం పెంచిన ఎరువుల ధరలను  వెంటనే తగ్గించాలని డి మాండ్‌ చేశారు.

Updated Date - 2021-05-06T06:02:30+05:30 IST