టీడీపీ నేతలపై పామర్రు పీఎస్లో కేసు
ABN , First Publish Date - 2022-01-23T02:19:44+05:30 IST
టీడీపీ నేతలు వర్ల రామయ్య, దండమూడి చౌదరిపై పామర్రు పీఎస్లో
కృష్ణా: టీడీపీ నేతలు వర్ల రామయ్య, దండమూడి చౌదరిపై పామర్రు పీఎస్లో కేసు నమోదయింది. కుట్ర (120B), 353, రెడ్విత్ 34 IPC సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. వర్ల రామయ్య, దండమూడి చౌదరిపై సీసీఎస్ సీఐ ఈ బాలశౌరి ఫిర్యాదు చేశారు. నిన్న టీడీపీ నిజనిర్దారణ కమిటీ గుడివాడ వెళ్తుండగా పామర్రు దగ్గర పోలీసులు నిలిపివేశారు. నిబంధనలకు విరుద్దంగా వెళ్తున్నారని నిలిపివేశామని పోలీసులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. అడ్డుకున్న పోలీసులపై అసభ్య పదజాలంతో దూషించారని పోలీసులు పేర్కొన్నారు. శాంతిభద్రతల సమస్యను సృష్టించేందుకు కలిసి వెళ్తున్నారని ఎఫ్ఐఆర్లో ఆరోపణలు చేశారు.