గోవును హత్య చేసిన ముగ్గురిపై కేసు

ABN , First Publish Date - 2022-05-23T05:02:07+05:30 IST

గోవు మాంసం విక్రయించేందుకు ఆవును హత్య చేసిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు కంగ్టి ఎస్‌ఐ అబ్దుల్‌ రఫిక్‌ తెలిపారు.

గోవును హత్య చేసిన ముగ్గురిపై కేసు

కంగ్టి, మే 22: గోవు మాంసం విక్రయించేందుకు ఆవును హత్య చేసిన ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు కంగ్టి ఎస్‌ఐ అబ్దుల్‌ రఫిక్‌ తెలిపారు. కంగ్టి గ్రామానికి చెందిన కటికె ఖలీల్‌, నిస్సార్‌, అజీమోద్దిన్‌ ఆదివారం తెల్లవారుజామున ఆవును బంధించి హత్య చేస్తున్నట్లు కర్ణాటకలోని బాల్కి తాలుక బోర్నాల్‌ గ్రామానికి చెందిన బిరాదర్‌ మంజూనాథ్‌కు ఫోన్‌ ద్వారా   సమాచారం అందింది. బిరాదర్‌ మంజూనాథ్‌ సూచన మేరకు స్థానికులు కొందరు ఆవును హత్య చేస్తున్న దృశ్యాలను వీడియో తీశారు. దీంతో గోవును హత్య చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మంజూనాథ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ అబ్దుల్‌ రఫిక్‌ తెలిపారు. కాగా కంగ్టిలో గోవును వధించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆదివారం భజరంగ్‌దళ్‌, గోరక్ష్‌ బాధ్యులతో కలిసి ఖేడ్‌లోని డీఎస్పీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప వినతిపత్రాన్ని అందజేశారు.

Updated Date - 2022-05-23T05:02:07+05:30 IST