రాజధాని ఉద్యమం 200 రోజులు పూర్తైన తర్వాత కొత్త ట్విస్ట్

ABN , First Publish Date - 2020-07-06T05:30:00+05:30 IST

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ జరుగుతున్న ఉద్యమంలో..

రాజధాని ఉద్యమం 200 రోజులు పూర్తైన తర్వాత కొత్త ట్విస్ట్

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ జరుగుతున్న ఉద్యమంలో పాల్గొంటున్న బీజేపీ.. 200 రోజులు పూర్తయిన తర్వాత కొత్త ట్విస్ట్ ఇచ్చింది. ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ సునిల్ దియోదర్.. రాజధాని కోసం రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతు ఇస్తామని చెబుతూనే.. మరోవైపు రాజధాని ఎక్కడ ఉండాలనేది ఏపీ ప్రభుత్వం పరిధిలో ఉంటుందంటున్నారు. రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోబోదని సన్నాయి నొక్కులు నొక్కారు. రాజధాని ఉద్యమంపై స్పందించని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం రైతుల ఉద్యమానికి తన పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఈ తాజా పరిణామాలు ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారాయి.

Updated Date - 2020-07-06T05:30:00+05:30 IST