కాల్వలకు పూర్తిస్థాయిలో నీరందించాలి
ABN , First Publish Date - 2022-01-21T06:04:11+05:30 IST
తెలంగాణ నుంచి ఆంధ్రాలోని ఇబ్రహీంపట్నం, మూలపాడు మేజర్ కాల్వలకు పూర్తిస్థాయిలో నీరు అందించాలని ఎన్ఎస్పీ సీఈ ఎం.శ్రీనివాసులు రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఎన్ఎస్పీ సీఈ శ్రీనివాసులురెడ్డి
వీరులపాడు, జనవరి 20 : తెలంగాణ నుంచి ఆంధ్రాలోని ఇబ్రహీంపట్నం, మూలపాడు మేజర్ కాల్వలకు పూర్తిస్థాయిలో నీరు అందించాలని ఎన్ఎస్పీ సీఈ ఎం.శ్రీనివాసులు రెడ్డి అధికారులను ఆదేశించారు. మూలపాడు మేజర్ కాల్వను గురువారం అధికారులతో కలసి పరిశీలించారు. ఎగువ ప్రాంతం నుంచి వచ్చే ప్రతీ సాగర జలాన్ని రైతులు సద్వినియోగపర్చుకునేలా చూడాలని, ముఖ్యంగా కాల్వ ఆధునీకరణకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. వచ్చే వేసవిని దృష్టిని ఉంచుకుని చెరువులు, కుంటలు నింపుకునేలా చూడాలన్నారు. ఈఈ అప్పారావు, డీఈఈ శ్రీనివాసరావు, ఏఈఈ నాగరాజు నాయక్, మాజీ నీటిసంఘం అధ్యక్షుడు కోటేరు సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.