బస్సుకు తృటిలో తప్పిన ప్రమాదం

ABN , First Publish Date - 2021-04-08T02:02:57+05:30 IST

జిల్లాలోని విమానాశ్రయం దగ్గర పెను ప్రమాదం తప్పింది. ఏలూరు నుంచి విజయవాడకు ఆర్టీసీ

బస్సుకు తృటిలో తప్పిన ప్రమాదం

కృష్ణా: జిల్లాలోని విమానాశ్రయం దగ్గర పెను ప్రమాదం తప్పింది. ఏలూరు నుంచి విజయవాడకు ఆర్టీసీ నాన్ స్టాప్ బస్సు వెళుతోంది. చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారిపై విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గర ఒక్కసారిగా బస్సు టైర్ పంక్చర్ అయింది. దీంతో బస్సు పక్కకు ఒరిగింది. ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో మొత్తం 28 మంది ప్రయాణికులు ఉన్నారు. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై  అర్టీసీ అధికారులు విచారణ చేస్తున్నారు. 

Updated Date - 2021-04-08T02:02:57+05:30 IST