వైసీపీ పాలనలో సామాన్యులపై భారం

ABN , First Publish Date - 2022-06-26T05:37:36+05:30 IST

వైసీపీహయాంలో నిత్యావసర సరుకులు, పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలతోపాటు రవాణాచార్జీలు పెరగడం తో సామాన్యులపై భారం పడిందని మా

వైసీపీ పాలనలో సామాన్యులపై భారం
బూర్జపాడులో ర్యాలీ నిర్వహిస్తున్న టీడీపీ నాయకులు


వైసీపీ పాలనలో సామాన్యులపై భారం

  ‘బాదుడే బాదుడు’లో టీడీపీ నాయకులు

ఇచ్ఛాపురంరూరల్‌, జూన్‌ 25: వైసీపీహయాంలో నిత్యావసర సరుకులు, పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలతోపాటు రవాణాచార్జీలు పెరగడం తో సామాన్యులపై భారం పడిందని  మాజీ ఎంపీపీ, ఏఎంసీ మాజీ చైర్మన్లు డి.ఢిల్లీరావు, సాడి సహదేవు రెడ్డి  తెలిపారు. శనివారం బూర్జపాడు, చిన్నబూర్జపాడు గ్రామాల్లో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటికి కరపత్రాలు పంపిణీ చేసి, ప్రభుత్వ వ్యతిరేక విధానాలు ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో నాయకులు డి.కామేష్‌, ఎల్‌.పద్మ నాభం, బోర ప్రసాద్‌, డి.లోకనాధం, బి.లోహిదాసు, పి.శ్రీనివాస్‌, కె.గోపి, నారాయణ పాల్గొన్నారు. 

 రానున్న ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెప్పాలి 

ఎచ్చెర్ల: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంకావాలని జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ చౌదరి ధనలక్షి ్మ, టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి అన్నారు. జరజాం గ్రామంలో శనివారం సాయంత్రం టీడీపీ నేతలను, కార్యకర్తలను, ప్రజలను వారు కలిశారు. వైసీపీ వైఫల్యాలను ఎండిగట్టి, రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలుపే ధ్యేయంగా పనిచేయాలన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడును చూసేందుకు ప్రజలు ఉత్సాహం చూపుతున్నారని చెప్పారు. వైసీపీ వైఫల్యాలను ప్రశ్నించే టీడీపీ నేతలపై పోలీసులు తప్పుడు కేసులు బనాయిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు తంగి మల్లేశ్వరరావు, దుంగ దాలినాయుడు, బాన్న రాంబాబు, చౌదరి అవినాష్‌ తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-06-26T05:37:36+05:30 IST