బావిలో పడిన బాలుడు మృతి
ABN , First Publish Date - 2021-08-12T21:35:04+05:30 IST
నగరంలోని అల్వాల్ పీఎస్ పరిధి మచ్చ బొల్లారంలో దారుణం చోటుచేసుకుంది. బాలుడు
హైదరాబాద్: నగరంలోని అల్వాల్ పీఎస్ పరిధి మచ్చ బొల్లారంలో దారుణం చోటుచేసుకుంది. బాలుడు సన్నీ(2) ఆడుకుంటూ వెళ్లి బావిలో పడ్డాడు. స్థానికులు గమనించి బావి నుంచి బాలుడిని బయటకు తీశారు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. కుమారుడు చనిపోవడంతో కుటుంబసభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.