కుంటలోకి దిగి బాలుడి మృతి
ABN , First Publish Date - 2021-06-23T07:40:17+05:30 IST
: ఆడుకోవడానికి కుంటలోకి దిగిన రెండేళ్ల బాలుడు మృతి చెందాడు.
ఇద్దరు చిన్నారులను కాపాడిన స్థానికులు
గుండాల, జూన్ 22: ఆడుకోవడానికి కుంటలోకి దిగిన రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన బొడిగ సతీష్, మానసల కుమారుడు అన్విత్(2) తన అక్క లక్కి, మేనత్త కూతుర్తె నందినిలు ఆడుకోవడానికి ఇంటి సమీపంలో ఉన్న వెంకయ్య కుంటలోకి దిగారు. కుంట నీటిలో మునిగి గిలగిలా కొట్టుకుంటున్నారు. అటుగా వెళుతున్నవారు గమనించి బయటికి లాగడంతో ఇద్దరు ప్రాణాపాయం నుంచి బయటిపడ్డారు. అప్పటికే అన్విత్ మృతి చెందాడు.