ఆలయ స్థలం హద్దులను గుర్తించాలి
ABN , First Publish Date - 2020-06-04T09:20:52+05:30 IST
నీళ్లపల్లి ఏకాంబర రామలింగేశ్వర ఆలయ స్థలం హద్దులను గుర్తించాలని ఆలయ కమిటీ అధ్యక్షులు పి.శ్రీనివా్సరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆచారి నర్సింలు బుధవారం తహసీల్దార్
బషీరాబాద్ 75 తహసీల్దార్కు వినతిపత్రం ఇస్తున్న ఆలయ చైర్మన్ శ్రీనివా్సరెడ్డి
బషీరాబాద్ : నీళ్లపల్లి ఏకాంబర రామలింగేశ్వర ఆలయ స్థలం హద్దులను గుర్తించాలని ఆలయ కమిటీ అధ్యక్షులు పి.శ్రీనివా్సరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఆచారి నర్సింలు బుధవారం తహసీల్దార్ షౌఖత్అలీకి వినతిపత్రం అందజేశారు. ఆలయ సమీపంలో కొంతమంది రైతులకు భూములున్నాయని, వారు ఏటేటా ఆలయం స్థలంలోకి చొచ్చుకొని వస్తుండటంతో ఆలయ ప్రాంగణ స్థలం కుదించుకుపోతోందన్నారు. భూ ముల సర్వే చేయించాలని కోరారు. అలాగే పాత ఇస్మాయిల్పూర్లో నాలుగు ఎకరాల గ్రామకంఠం కబ్జాకు గురవుతోందని, ఆ భూమి కూడా ఆలయానికి అప్పగించాలన్నారు.