గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

ABN , First Publish Date - 2021-06-20T05:34:28+05:30 IST

జహీరాబాద్‌ పట్టణ సమీపంలోని బీదర్‌ వెళ్లే రోడ్డుపక్కన గల ఓ ఫాంహౌజ్‌ వద్ద శనివారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభించిందని జహీరాబాద్‌ పట్టణ ఎస్‌ఐ శ్రీకాంత్‌ తెలిపారు.

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

జహీరాబాద్‌, జూన్‌ 19: జహీరాబాద్‌ పట్టణ సమీపంలోని బీదర్‌ వెళ్లే రోడ్డుపక్కన గల ఓ ఫాంహౌజ్‌ వద్ద శనివారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభించిందని జహీరాబాద్‌ పట్టణ ఎస్‌ఐ శ్రీకాంత్‌ తెలిపారు. ఆయన కథనం ప్రకారం... సుమారు 65 సంవత్సరాల వయస్సున్న వ్యక్తి బీదర్‌వైపు వెళ్తున్న క్రమంలో అనారోగ్యం కారణంగా మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవు. మృతదేహాన్ని జహీరాబాద్‌ ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీలో భద్రపరిచారు. సంబంధీకులు ఎవరైనా ఉంటే జహీరాబాద్‌ పోలీసులను సంప్రదించాలని ఎస్‌ఐ తెలిపారు. వీఆర్వో పాండు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.


Updated Date - 2021-06-20T05:34:28+05:30 IST