గుర్తుతెలియని యాచకుడి మృతదేహం లభ్యం
ABN , First Publish Date - 2021-04-21T07:11:53+05:30 IST
గుర్తుతెలియని యాచకుడి మృతదేహం లభ్యమైంది.
జెమ్మాపూర్ బస్టాప్ వద్ద మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు
భువనగిరి రూరల్, ఏప్రిల్ 20: గుర్తుతెలియని యాచకుడి మృతదేహం లభ్యమైంది. భువనగిరి రూరల్ ఎస్ఐ కె.సైదులు తెలిపిన వివరాల ప్రకా రం.. భువనగిరి మండలం జెమ్మాపూర్ బస్టాప్ వద్ద యాచించి జీవించే గుర్తుతెలియని 50 సంవ త్సరాల వ్యక్తి మృతదేహాన్ని క్లస్టర్ వద్ద స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. వివరాల కోసం 9381739971, 94906 17543 నెంబర్లకు సంప్రదించాలని కోరారు.