గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
ABN , First Publish Date - 2022-06-28T06:22:00+05:30 IST
మండలంలోని కంఠీపురం గ్రామ బావి లో గల్లంతైన యువకుడు బీరలింగప్ప (23) సోమవారం శవమై తేలాడు. స్థా నికులు తెలిపిన వివరాలివి
మడకశిర రూరల్, జూన 27: మండలంలోని కంఠీపురం గ్రామ బావి లో గల్లంతైన యువకుడు బీరలింగప్ప (23) సోమవారం శవమై తేలాడు. స్థా నికులు తెలిపిన వివరాలివి. గ్రామానికి చెందిన బీరలింగప్ప ఆదివారం బావి లో ఈతకు వెళ్లి అదృశ్యమైన విషయం తెలిసిందే. అగ్నిమాపక సిబ్బంది రెం డు రోజులుగా శ్రమించి బావిలో నుం చి యువకుడి మృతదేహాన్ని వెలికితీ శారు. కుమారుడి మృతదేహాన్ని చూసి న తల్లిదండ్రులు భాగ్యమ్మ, బీరప్ప కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.