గవర్నర్‌‌ను కలిసిన బీజేపీ బృందం

ABN , First Publish Date - 2022-01-09T02:43:58+05:30 IST

రాష్ట్ర గవర్నర్‌ తమిళిసైను బీజేపీ బృందం

గవర్నర్‌‌ను కలిసిన బీజేపీ బృందం

  హైదరాబాద్‌:  రాష్ట్ర గవర్నర్‌ తమిళిసైను బీజేపీ బృందం కలిసింది. ప్రధాని మోదీ రక్షణ విషయంలో పంజాబ్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించిదంటూ ఫిర్యాదు చేశారు. మోదీ రక్షణపై రైతుల ముసుగులో కాంగ్రెస్ కుట్ర పన్నిందన్నారు. 


పంజాబ్‌లో ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన మోడీ కాన్వాయ్‌ని నిరసనకారులు అడ్డుకున్నారు. దాదాపు 20 నిమిషాల పాటు ఫ్లై ఓవర్ పై చిక్కుకుని ఉండిపోయారు. సాక్ష్యాత్తు  దేశ ప్రధానికే తగినంత భద్రత కల్పించడంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపణలు వెల్లువెత్తాయి. చరిత్రలోనే మొదటిసారిగా ప్రధాని వెనుదిరిగారు. 

Updated Date - 2022-01-09T02:43:58+05:30 IST