బీజేపీది అబద్ధపు ప్రచారం
ABN , First Publish Date - 2020-12-03T08:09:49+05:30 IST
సోషల్ మీడియాలో బీజేపీ అబద్ధాలను ప్రచారం చేస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవియా రైతులపై చేసిన
ఎమ్మెల్సీ కవిత ట్వీట్
హైదరాబాద్, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): సోషల్ మీడియాలో బీజేపీ అబద్ధాలను ప్రచారం చేస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవియా రైతులపై చేసిన పోస్టింగ్ను ట్విటర్ తొలగించడంపై ఆమె స్పందించారు.
‘‘మ్యానిపులేటేడ్ మీడియా పేరుతో బీజేపీ ఐటీ సెల్ నాయకుడి ట్వీట్ను తొలగించడం మంచుకొండలాంటిది. బీజేపీ వ్యాప్తిచేసిన తప్పుడు ప్రచారాలపై ఏదో ఒక రోజు నిజం విజయం సాధిస్తుంది.’’ అని కల్వకుంట్ల కవిత ట్వీట్ చేశారు.