బడుగు బలహీన వర్గాలకు BJP బాసటగా నిలిచింది: లక్ష్మణ్

ABN , First Publish Date - 2022-05-11T00:00:24+05:30 IST

బడుగు బలహీన వర్గాలకు BJP బాసటగా నిలిచింది: లక్ష్మణ్

బడుగు బలహీన వర్గాలకు BJP బాసటగా నిలిచింది: లక్ష్మణ్

హైదరాబాద్: బడుగు బలహీన వర్గాలకు BJP బాసటగా నిలిచిందని BJP OBC మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. కేంద్రం నిధులిస్తుంటే, రాష్ట్రాలు సొమ్ము ఒకరిది, సోకు ఒకరిది అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయని మండిపడ్డారు. దళారి పాత్ర లేకుండా, పథకాలను కాజేస్తున్నారని, బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రతో ప్రగతి భవన్ లో ప్రకంపనలు మొదలయ్యాయని చెప్పారు. సీఎం దత్తత తీసుకున్న గ్రామనికే దిక్కు లేదని, తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావటం ఖాయమని తెలిపారు. ఈ నెల 14 తెలంగాణలో అమిత్ షా బహిరంగ సభ ఉంటుందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా, ఎదుర్కోవటానికి BJP సిద్ధంగా ఉందని తెలిపారు. పాలమూరు జిల్లా గురించి మాట్లాడే హక్కు టీఆరెస్‌కు లేదని లక్ష్మణ్ అన్నారు.


Read more