బైక్ అదుపు తప్పి..
ABN , First Publish Date - 2021-10-20T06:56:38+05:30 IST
మునుగోడు గ్రామశివారులో బైక్ అదుపుతప్పి కిందపడడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు.
మునుగోడురూరల్, అక్టోబరు 19: మునుగోడు గ్రామశివారులో బైక్ అదుపుతప్పి కిందపడడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన ఎస్కె.జహంగీర్ (51) యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురానికి తన ద్విచక్రవాహనంపై వెళ్లి తిరిగి వస్తున్నాడు. మార్గమధ్యలో మునుగోడు గ్రామ శివారులోని పత్తి మిల్లు వద్ద అదుపు తప్పి కింద పడిపోవడంతో తీవ్రమైన గాయాలయ్యాయి. గమనించిన చుట్టుప క్కల వారు చికిత్స నిమిత్తం నల్లగొండ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.