బైక్ అదుపుతప్పి గోడను ఢీకొని వ్యక్తి మృతి
ABN , First Publish Date - 2022-01-17T06:19:23+05:30 IST
బైక్పై వెళుతూ అదుపుతప్పి గోడను ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన నాయుడుతోట వెంకట సాయి నగర్లో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసు కుంది.
వేపగుంట, జనవరి 16: బైక్పై వెళుతూ అదుపుతప్పి గోడను ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన నాయుడుతోట వెంకట సాయి నగర్లో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసు కుంది. పెందుర్తి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వెంకటసాయినగర్ కొండవాలు ప్రాం తానికి చెందిన మళ్ల సతీశ్(42) లారీ డ్రైవర్గా పని చేస్తున్నాడు. అతనికి భార్య లక్ష్మి, ఇద్దరు కుమారులు ఉన్నారు. శుక్రవారం పనులు ముగిం చుకుని ఇంటికి వచ్చిన అతను అర్ధరాత్రి వేళ బైక్పై బయటకు వెళ్లాడు. బైక్ను వేగంగా నడపడంతో అదుపు తప్పి అక్కడ నిర్మాణంలో ఉన్న ఆస్పత్రి గోడను ఢీకొన్నాడు. తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు శనివారం ఉదయం చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కి తరలించారు.