లింగంపల్లిలో తృటిలో తప్పిన పెను ప్రమాదం

ABN , First Publish Date - 2021-03-10T23:40:20+05:30 IST

నగరంలోని లింగంపల్లిలో తృటిలో పెను ప్రమాదం తప్పింది.

లింగంపల్లిలో తృటిలో తప్పిన పెను ప్రమాదం

హైదరాబాద్: నగరంలోని లింగంపల్లిలో తృటిలో పెను ప్రమాదం తప్పింది. విద్యార్థులతో స్కూల్ బస్‌ వెళ్తుంది. ఇంతలో బస్ డ్రైవర్‌కు అకస్మాత్తుగా ఫిట్స్ వచ్చాయి. దీంతో  బస్సు అదుపు తప్పింది. లింగంపల్లి చౌరస్తాలో డివైడర్‌ను అదుపు తప్పిన బస్సు ఢీ కొట్టింది. అక్కడే ఉన్న కరెంట్ స్తంభాలను కూడా బస్ ఢీ కొట్టింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు డ్రైవర్‌ను హాస్పిటల్‌కు తరలించారు. బస్‌లోని విద్యార్థులు సురక్షితంగా బయటపడ్డారు. దీంతో విద్యార్థుల తల్లితండ్రులు, స్కూల్ యాజమాన్యం ఊపిరి పీల్చుకున్నారు. 

Updated Date - 2021-03-10T23:40:20+05:30 IST