జోరుగా అమ్ముడైన ఈల్డు పాము చేపలు
ABN , First Publish Date - 2020-10-01T08:55:52+05:30 IST
అంతర్వేది చేపలరేవులో జోరుగా ఈల్డు పాముచేపలు ఎగుమతులు జరిగాయి. విశాఖపట్నం నుంచి వచ్చిన వలస
అంతర్వేది, సెప్టెంబరు 30: అంతర్వేది చేపలరేవులో జోరుగా ఈల్డు పాముచేపలు ఎగుమతులు జరిగాయి. విశాఖపట్నం నుంచి వచ్చిన వలస మత్స్యకారులు సముద్రంపై వేట చేసుకుంటూ గేలాల ద్వారా ఈల్డు చేపలను వేటాడుకొచ్చారు. వాటిని అంతర్వేది చేపలరేవులో అమ్మకానికి సిద్ధం చేశారు.
సుమారు 10 కేజీలు ఉండే ఈల్డు పాము చేప ముంబై, పూణే, హౌరా వంటి ప్రాంతాలకు ఎగుమతులు అవుతాయని తెలిపారు. ఈల్డు పాము చేపలో ఉన్న పొట్ట భాగాన్ని మాత్రం ఔషధాల్లో ఉపయోగిస్తారని మత్స్యకారులు తెలిపారు.