భారత్‌ శుభారంభం

ABN , First Publish Date - 2022-04-03T09:42:18+05:30 IST

ఎఫ్‌ఐహెచ్‌ మహిళల జూనియర్‌ వరల్డ్‌కప్‌లో భారత అమ్మాయిలు శుభారంభం చేశారు.

భారత్‌ శుభారంభం

 జూనియర్‌ మహిళల హాకీ ప్రపంచకప్‌

పొచెఫ్‌స్ట్రూమ్‌ (దక్షిణాఫ్రికా): ఎఫ్‌ఐహెచ్‌ మహిళల జూనియర్‌ వరల్డ్‌కప్‌లో భారత అమ్మాయిలు శుభారంభం చేశారు. శనివారం జరిగిన పూల్‌-డిలోని తమ తొలి లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ 5-1తో వేల్స్‌ను చిత్తు చేసింది. భారత జట్టులో లాల్‌రమ్సియామి (4వ నిమిషం), లాల్‌రిండికి (32వ, 57వ), ముంతాజ్‌ (41వ), దీపిక (58వ) గోల్స్‌ చేశారు. వేల్స్‌ నుంచి ఏకైక గోల్‌ను మిల్లీ హోల్మ్‌ 26వ నిమిషంలో కొట్టింది. ఆదివారం జర్మనీతో భారత్‌ ఆడనుంది. 

Updated Date - 2022-04-03T09:42:18+05:30 IST