అక్టోబరు ఆఖరికి బ్యారేజీలు పూర్తి
ABN , First Publish Date - 2020-07-08T11:10:12+05:30 IST
సంగం, నెల్లూరు బ్యారేజీల నిర్మాణం అక్టోబరు ఆఖరికి పూర్తి చేసి సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలుగుగంగ ప్రాజెక్టు ఎస్ఈ హరినారాయణరెడ్డి
టీజీపీ ఎస్ఈ హరినారాయణరెడ్డి
సంగం, జూలై 7: సంగం, నెల్లూరు బ్యారేజీల నిర్మాణం అక్టోబరు ఆఖరికి పూర్తి చేసి సీఎం చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు తెలుగుగంగ ప్రాజెక్టు ఎస్ఈ హరినారాయణరెడ్డి తెలిపారు. మంగళవారం ఈఈ నాయక్తో కలిసి ఆయన బ్యారేజి పనులను పర్యవేక్షించారు.
ఆయన మాట్లాడుతూ కరోనా కారణంగా కూలీలు ఇళ్లకు వెళ్లడంతో పనుల్లో కొంత జాప్యం జరిగిందన్నారు. సంగం బ్యారేజి పనులు 85 శాతం పూర్తయ్యాయన్నారు. మిగిలిన పనుల్లో వేగం పెంచి అక్టోబరు కల్లా రెండు బ్యారేజీలను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆయన వెంట బ్యారేజీ నిర్వాహకులు రాజు, ఏజెన్సీ ఇంజనీర్లు, ఏఈ విజయభాస్కర్రెడ్డి ఉన్నారు.