మేళ్లచెర్వు జాతరను వైభవంగా నిర్వహించాలి
ABN , First Publish Date - 2022-01-28T06:05:54+05:30 IST
: మేళ్లచెర్వు మహాశివ రాత్రి జాతరను వైభవంగా నిర్వహించాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కోరారు.
ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి
హుజూర్నగర్ రూరల్/మేళ్లచెర్వు, జనవరి 27: మేళ్లచెర్వు మహాశివ రాత్రి జాతరను వైభవంగా నిర్వహించాలని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కోరారు. గురువారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఉత్సవ కమిటీ నిర్వాహకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జాతరను శాంతియుతంగా జరపాలన్నారు. ఎడ్ల పందేలు నిర్వహిస్తున్నందున రైతులు జాగ్రత్తలు పాటించాలన్నారు. తెలుగు రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ఎద్దుల పందేలకు ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. ఈ సందర్భంగా ఎడ్ల పందేల్లో మొదటి బహుమతిగా నిర్వా హకులు ప్రకటించిన ట్రాక్టర్ను నడిపారు. ఈ కార్యక్రమంలో మేళ్లచెర్వు సర్పంచ్ పందిళ్లపల్లి శంకర్రెడ్డి, సూరిశెట్టి బసవయ్య, బాలవెంకటరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, వర్రా వెంకటరెడ్డి, బుస్సా, సత్యనారాయణ, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.