తల్లి చెంతకు చేరిన పసికందు
ABN , First Publish Date - 2022-05-16T05:41:39+05:30 IST
రెంజల్ మండలం నీలా గ్రామానికి చెందిన తల్లి రేణుక చెంతకు చిన్నారి చేరింది. ఆదివారం ఐసీడీఎస్ అధికారులు గ్రామంలోని రేణుక ఇంటికి వచ్చి విచారణ చేపట్టారు. చిన్నారిని రెంజల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించి కేసీఆర్ కిట్టుతో పాటు మందులను అందజేశారు. రేణుక మానసిక స్థితి బాగులేనందున కుటుంబ సభ్యులు ఆమెతో పాటు చిన్నారి సరిగ్గా చూసుకోవాలని సూచించారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉండేలా చూసుకోవాలని భర్త నగేష్తో పాటు కుటుంబ సభ్యులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. అంగన్వాడీ టీచర్ సురేఖ, గ్రామస్థులు పాల్గొన్నారు.
రెంజల్, మే 15 : రెంజల్ మండలం నీలా గ్రామానికి చెందిన తల్లి రేణుక చెంతకు చిన్నారి చేరింది. ఆదివారం ఐసీడీఎస్ అధికారులు గ్రామంలోని రేణుక ఇంటికి వచ్చి విచారణ చేపట్టారు. చిన్నారిని రెంజల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించి కేసీఆర్ కిట్టుతో పాటు మందులను అందజేశారు. రేణుక మానసిక స్థితి బాగులేనందున కుటుంబ సభ్యులు ఆమెతో పాటు చిన్నారి సరిగ్గా చూసుకోవాలని సూచించారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉండేలా చూసుకోవాలని భర్త నగేష్తో పాటు కుటుంబ సభ్యులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. అంగన్వాడీ టీచర్ సురేఖ, గ్రామస్థులు పాల్గొన్నారు.