బన్ని ఉత్సవాలకు అధికార యంత్రాంగం సన్నద్ధం

ABN , First Publish Date - 2020-09-30T17:11:17+05:30 IST

బన్ని ఉత్సవాలకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఈ ఏడాదైనా..

బన్ని ఉత్సవాలకు అధికార యంత్రాంగం సన్నద్ధం

ఆలూరు(కర్నూలు): బన్ని ఉత్సవాలకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఈ ఏడాదైనా కొవిడ్‌ నేపథ్యంలో నిబంధనలు పాటించి ఉత్సవాల్లో పాల్గొనాలని అవగాహన సదస్సు నిర్వహించారు. ఆదోని ఆర్డీవో రామకృష్ణారెడ్డి, డీఎస్పీ వినోద్‌కుమార్‌లు ఇప్పటికే సదస్సులు నిర్వహించారు. సారా నియంత్రణకు ఎక్సైజ్‌ శాఖ దాడులు ప్రారంభించారు. ఇతర రాష్ట్రాలలో ఉండే బంధువులను ఆహ్వానించవద్దని అధికారులు సూచిస్తున్నారు. ఉత్సవాలపై మానవహక్కుల కమిషన్‌ పలుమార్లు ఉత్సవాల్లో హింసపై  కలెక్టర్‌, ఎస్పీలకు నోటీసులు కూడా ఇచ్చారు.


దీంతో హింస తగ్గించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతున్నారు. పదేళ్ల క్రితం ఈ ఉత్సవాల్లో జరిగిన కర్రల సమరంలో వ్యక్తిగత కక్షలతో ఒకరు మృతి చెందగా, ఓ సీఐపై దాడి చేశారు. ఆ సమయంలో కొందరు అల్లరి మూకలు రెచ్చిపోయి అగ్నికాగడాలు ప్రజలపై విసరడంతో గాయాలపాలయ్యారు.  మరి ఏడాది ఎలా జరుగుతుందో చూడాలి మరి. 

Updated Date - 2020-09-30T17:11:17+05:30 IST