నాలుగో టీ20లో ఆసీస్ విన్
ABN , First Publish Date - 2021-03-06T09:07:28+05:30 IST
ఐదు టీ20ల సిరీ్సలో భాగంగా శుక్రవారం జరిగిన నాలుగో మ్యాచ్లో ఆస్ట్రేలియా 50 పరుగుల తేడాతో న్యూజిలాండ్పై గెలిచింది.
వెల్లింగ్టన్: ఐదు టీ20ల సిరీ్సలో భాగంగా శుక్రవారం జరిగిన నాలుగో మ్యాచ్లో ఆస్ట్రేలియా 50 పరుగుల తేడాతో న్యూజిలాండ్పై గెలిచింది. దీంతో సిరీస్లో ఇరుజట్లు 2-2తో సమంగా నిలిచాయి. సిరీస్ విజేతను నిర్ణయించే ఆఖరి టీ20 ఆదివారం జరగనుంది. తొలుత ఆసీస్.. కెప్టెన్ ఆరోన్ ఫించ్ (79) అజేయ అర్ధశతకంతో రాణించడంతో 20 ఓవర్లలో 6 వికెట్లకు 156 పరుగులు చేసింది. టీ20ల్లో 100 సిక్సర్లు కొట్టిన తొలి ఆసీస్ క్రికెటర్గా, ఓవరాల్గా ఆరో బ్యాట్స్మన్గా ఫించ్ అవతరించాడు. ఆసీస్ తరఫున ఈ ఫార్మాట్లో అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా వార్నర్ (2265)ను ఫించ్ (2310) అధిగమించాడు. ఛేదనలో కివీస్ 18.5 ఓవర్లలో 106 రన్స్కే కుప్పకూలింది. జట్టులో పేసర్ కైల్ జేమిసన్ (30) టాప్స్కోరర్.