అఖిలపక్షంపై సీఎం వైఖరి స్పష్టం చేయాలి
ABN , First Publish Date - 2022-01-23T06:11:33+05:30 IST
విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉద్యమానికి నాయకత్వం వహించి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తీసుకోవాలని టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోగంటి లెనిన్బాబు అన్నారు.
టీఎన్టీయూసీ నేత లెనిన్బాబు డిమాండ్
ఉక్కుటౌన్షిప్, జనవరి 22: విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉద్యమానికి నాయకత్వం వహించి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తీసుకోవాలని టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోగంటి లెనిన్బాబు అన్నారు. టౌన్షిప్లో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని పార్టీలు కలిసి అఖిలపక్షం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నా, వైసీపీ ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. స్టీల్ప్లాంట్ను పరిరక్షించుకునేందుకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు చేశామని, వాటిని మరింత ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నమ్మి సింహాద్రి, పల్లా పెంటారావు, అప్పలనాయుడు, నరేంద్ర, వియ్యపు సొమినాయుడు, సుభాకర్, సాహు, రాజన్రాజు, శ్రీనివాసవర్మ పాల్గొన్నారు.