దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయాలి
ABN , First Publish Date - 2022-01-23T06:12:45+05:30 IST
దంపతులపై దాడి చేసి గాయపరిచిన వ్యక్తిని అరెస్ట్ చేయాలని మండలంలోని మంతపురి గ్రామంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
ఆలేరు రూరల్, జనవరి 22: దంపతులపై దాడి చేసి గాయపరిచిన వ్యక్తిని అరెస్ట్ చేయాలని మండలంలోని మంతపురి గ్రామంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు నిందితుడి ఇంటి ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు రోజుల క్రితం గ్రామానికి చెందిన చెక్క లక్ష్మి, సూర్యం దంపతులపై అదే గ్రామానికి చెందిన పల్ల భరతరెడ్డి దాడి చేసి గాయపరిచాడన్నారు. ఈ విషయమై భార్య భర్తలు ఆలేరు పోలీస్ స్టేషనలోఫిర్యాదు చేశారని తెలిపారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేయకపోవడాన్ని నిరసిస్తూ నిందితుడి ఇంటి వద్ద బైఠాయించినట్లు తెలిపారు. పోలీసులు సైతం బాధితులకు న్యాయం చేయడంలో నిర్లక్ష్యం వహించారని అరోపించారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేయడంతో ధర్నాను విమరించారు. కార్యక్రమంలో నాయకులు కందుల శంకర్, తేరపు రాములు, చెక్క వెంకటేష్, శ్రీనివాస్, అశోక్, సిద్దిమల్లయ్య, నరేష్, శేఖర్ ఉన్నారు.