కమిషనర్‌పై దాడి అమానుషం

ABN , First Publish Date - 2022-06-25T05:40:05+05:30 IST

రాయచోటి కమీషనర్‌ పై దాడి చేయడం అమానుషమని మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఉద్యోగులు పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీలు, నగరపంచాయతీలు, కడప కార్పొరేషన్‌ ఉద్యోగులు నిరసన తెలిపారు. కడప నగరపాలక సంస్థ

కమిషనర్‌పై దాడి అమానుషం
కార్పొరేషన్‌ ఎదుట సంఘీభావం తెలుపుతున్న కార్పొరేషన్‌ అధికారులు, సిబ్బంది

జిల్లా వ్యాప్తంగా కార్పొరేషన్‌ ఉద్యోగుల నిరసన

కడప(ఎర్రముక్కపల్లి), జూన్‌ 24 : రాయచోటి కమీషనర్‌ పై దాడి చేయడం అమానుషమని మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఉద్యోగులు పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా మున్సిపాలిటీలు, నగరపంచాయతీలు, కడప కార్పొరేషన్‌ ఉద్యోగులు నిరసన తెలిపారు. కడప నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట రాయచోటి మున్సిపల్‌ కమిషనర్‌కు సంఘీభావం తెలుపుతూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ కమిషనర్‌ చరణ్‌తేజ్‌రెడ్డి, డి ప్యూటీ కమిషనర్‌ రమణారెడ్డి, నగరపాలక సిబ్బంది పాల్గొన్నారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ కమిషనర్‌ రమణయ్య, ఎర్రగుంట్ల నగర పంచాయతీ కమిషనర్‌ జగన్నాథ్‌, జమ్మమలమడుగులో అసోసియేషన్‌ నేతలు, కమలాపురం నగర పంచాయతీ కమిషనర్‌ రాజశేఖర్‌ ఆఽధ్వర్యంలో కార్యాలయం వెలుపల సిబ్బంది నల్లబ్యాడ్జీలు ధరించి నిరన తెలిపారు.

Updated Date - 2022-06-25T05:40:05+05:30 IST