కళలను ప్రోత్సహించాలి

ABN , First Publish Date - 2022-01-18T05:23:04+05:30 IST

కళలను ప్రోత్సహించాలని ప్రముఖ సినీ నటుడు డాక్టర్‌ కుమార్‌నాయక్‌ అన్నారు. నారాయణపురంలో శ్రీబైకాల పోలమ్మ తల్లి యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో డివిజన్‌ స్థాయి డ్యాన్స్‌ బేబీ డ్యాన్స్‌ పోటీలు నిర్వహించారు.

కళలను ప్రోత్సహించాలి
విజేతలకు బహుమతులు అందజేస్తున్న కుమార్‌నాయక్‌

హరిపురం, జనవరి 17: కళలను ప్రోత్సహించాలని ప్రముఖ సినీ నటుడు డాక్టర్‌ కుమార్‌నాయక్‌ అన్నారు. నారాయణపురంలో శ్రీబైకాల పోలమ్మ తల్లి యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో డివిజన్‌ స్థాయి డ్యాన్స్‌ బేబీ డ్యాన్స్‌ పోటీలు నిర్వహించారు. డ్యూయెట్‌, సోలో, గ్రూప్‌ విభాగాల్లో జరిగిన ఈ పోటీల్లో 25 మంది పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. గీతిక (అల్లిమెరక), దివ్య (నారాయణపురం), భార్గవి (మల్లేనపేట) వరుసగా మొదటి మూడు బహుమతులను పొందగా కన్సోలేషన్‌ బహుమతిని దున్నూరు శ్రీను, చిరంజీవి (అక్కుపల్లి) పొందారు. వీరికి నిర్వాహకులు నగదు పురస్కారంతో పాటు జ్ఞాపికలను అందించారు. న్యాయనిర్ణేతలుగా కుమార్‌నాయక్‌, ఎం.దేవరాజు వ్యవహరించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ తేజేశ్వరరావు, ఎంపీటీసీ సభ్యులు గొరకల కేశవరావు, సివంగి వాసు, పోలయ్య, దానేష్‌ పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-01-18T05:23:04+05:30 IST