ఉపాధి కూలీల బకాయిలు వెంటనే చెల్లించాలి
ABN , First Publish Date - 2021-04-22T05:38:46+05:30 IST
ఉపాధి కూలీల వేతన బకాయిలను వెంటనే చెల్లించి, పని ప్రదేశంలో కనీస సదుపాయాలు కల్పించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.సత్యనారాయణ డిమాండ్ చేశారు.
ఎస్.రాయవరం : ఉపాధి కూలీల వేతన బకాయిలను వెంటనే చెల్లించి, పని ప్రదేశంలో కనీస సదుపాయాలు కల్పించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.సత్యనారాయణ డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని కొరుప్రోలులో ఉపాధి కూలీల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఏడు వారాల నుంచి కూలీలకు డబ్బులు ఇవ్వడం లేదని, వారు ఎవరిని సంప్రదించాలో కూడా తెలియడం లేదని సత్యనారాయణ ఆవేదన వెలిబుచ్చారు. ఈ సమస్యపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. పలువురు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
కోటవురట్ల : ఉపాధి కూలీల వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని సీపీఎం మండల కన్వీనర్ పెంటకోట వెంకటస్వామి డిమాండ్ చేశారు. బుధవారం కొడవటిపూడి, తిమ్మాపురం, లింగాపురం, పీకేపల్లి, తదితరుల గ్రామాల్లో పర్యటించి కూలీల సమస్యలు తెలుసుకున్నారు.