జూలై 21 నుంచి అమర్నాథ్ యాత్ర, రోజుకు 500 మందికే అనుమతి
ABN , First Publish Date - 2020-07-09T01:30:15+05:30 IST
జూలై 21 నుంచి అమర్నాథ్ యాత్ర, రోజుకు 500 మందికే అనుమతి
అమర్నాథ్ యాత్ర జూలై 21 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కోవిడ్-19 కారణంగా అమర్నాథ్ యాత్రకు రోజూ 500 మంది యాత్రికులకు మాత్రమే అనుమతి ఉంటుందని అధికారులు చెప్పారు. హిమాలయాలలో వార్షిక అమర్నాథ్ యాత్ర నిర్వహించబడుతుందని, కరోనా వైరస్ మహమ్మారి కారణంగా రోజూ 500 మందికిపైగా యాత్రికులను శివుని పవిత్ర గుహ మందిరాన్ని సందర్శించడానికి అనుమతించరని అధికారులు పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్లో ఉన్న అమర్నాథ్, వైష్ణోదేవి పుణ్యక్షేత్రాలకు తీర్థయాత్రల అంశంపై కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, జితేంద్ర సింగ్, హోం మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు చర్చించారు.